ముందు కాల్చి, తర్వాతే మాట్లాడతాం.. ‘స్లమ్డాగ్’ నుంచి టబు పవర్ఫుల్ గ్లింప్స్!
- విజయ్ సేతుపతి, పురి జగన్నాథ్ కాంబోలో వస్తున్న ‘స్లమ్డాగ్’
- పవర్ఫుల్ ఆఫీసర్ గౌరీ హెగ్డేగా నటిస్తున్న టబు
- విడుదలైన క్యారెక్టర్ గ్లింప్స్కు అద్భుత స్పందన
- షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు
- పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో విడుదల కానున్న చిత్రం
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్లమ్డాగ్ - 33 టెంపుల్ రోడ్’. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి, కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటి టబు క్యారెక్టర్ గ్లింప్స్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
ఈ సినిమాలో టబు ‘గౌరీ హెగ్డే’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. గ్లింప్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "భయంలేని, శక్తివంతమైన, ధైర్యవంతురాలు. భారతీయ సినిమా రత్నం టబును గౌరీ హెగ్డేగా పరిచయం చేస్తున్నాం" అని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. విడుదలైన వీడియోలో టబు తన పాత్రలో ఒదిగిపోయారు. కొందరిని కొడుతూ, బెదిరిస్తూ పవర్ఫుల్ ఆఫీసర్గా కనిపించారు. "మా స్టైల్లో మేము ముందు కాల్చి, ఆ తర్వాత మాట్లాడతాం" అంటూ విజయ్ సేతుపతికి ఆమె చెప్పే డైలాగ్ గ్లింప్స్కే హైలైట్గా నిలిచింది. చివర్లో "గౌరీ హెగ్డే - డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్" అని ఆమె తన హోదాను వెల్లడించడం ఆకట్టుకుంది.
గతేడాది జులైలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని చిత్ర వర్గాలు తెలిపాయి. గతంలో విడుదల చేసిన టైటిల్ పోస్టర్లో విజయ్ సేతుపతి చేతిలో కత్తి, చుట్టూ డబ్బు కట్టలతో కనిపించి సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్.. జేబీ మోషన్ పిక్చర్స్తో కలిసి జేబీ నారాయణరావు కొండ్రొళ్ల నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ దునియా విజయ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ‘అర్జున్ రెడ్డి’ (నేపథ్య సంగీతం), ‘యానిమల్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో టబు ‘గౌరీ హెగ్డే’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. గ్లింప్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "భయంలేని, శక్తివంతమైన, ధైర్యవంతురాలు. భారతీయ సినిమా రత్నం టబును గౌరీ హెగ్డేగా పరిచయం చేస్తున్నాం" అని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. విడుదలైన వీడియోలో టబు తన పాత్రలో ఒదిగిపోయారు. కొందరిని కొడుతూ, బెదిరిస్తూ పవర్ఫుల్ ఆఫీసర్గా కనిపించారు. "మా స్టైల్లో మేము ముందు కాల్చి, ఆ తర్వాత మాట్లాడతాం" అంటూ విజయ్ సేతుపతికి ఆమె చెప్పే డైలాగ్ గ్లింప్స్కే హైలైట్గా నిలిచింది. చివర్లో "గౌరీ హెగ్డే - డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్" అని ఆమె తన హోదాను వెల్లడించడం ఆకట్టుకుంది.
గతేడాది జులైలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని చిత్ర వర్గాలు తెలిపాయి. గతంలో విడుదల చేసిన టైటిల్ పోస్టర్లో విజయ్ సేతుపతి చేతిలో కత్తి, చుట్టూ డబ్బు కట్టలతో కనిపించి సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్.. జేబీ మోషన్ పిక్చర్స్తో కలిసి జేబీ నారాయణరావు కొండ్రొళ్ల నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ దునియా విజయ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ‘అర్జున్ రెడ్డి’ (నేపథ్య సంగీతం), ‘యానిమల్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.