ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యంపై మిస్టరీ.. వీడియో విడుదల చేసినా వీడని అనుమానాలు!
- ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై తీవ్రమైన ఊహాగానాలు
- ఆయన పరిస్థితి విషమమంటూ కథనాలు ప్రసారం చేసిన ఇజ్రాయెల్ మీడియా
- ఆయన ఆరోగ్యంగా ఉన్న వీడియో విడుదల చేసిన ఇరాన్
- తేదీ లేని వీడియో కావడంతో ప్రామాణికతపై పెరిగిన సందేహాలు
- లీడర్ను కలవడం కష్టమన్న ఇరాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలతో మరింత బలపడిన అనుమానాలు
ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేత (సుప్రీం లీడర్) ముజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్, అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను ఖండించేందుకు ఇరాన్ ప్రయత్నించింది. ఇందులో భాగంగా, ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటూ ప్రభుత్వ అనుబంధ 'మెహర్ న్యూస్ ఏజెన్సీ' శనివారం రాత్రి ఒక వీడియోను విడుదల చేసింది. అయితే, ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే దానిపై తేదీ లేకపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు మరింత బలపడ్డాయి.
కొన్ని రోజులుగా ముజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఆయనను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఇజ్రాయెల్ ‘ఛానల్ 14’ శుక్రవారం కథనాలు ప్రసారం చేసింది. ఇరాన్ అధ్యక్ష వర్గాల్లోనే ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోందని, "ఆయన వీరమరణం పొందారనే వార్త విన్నా మేం ఆశ్చర్యపోనక్కర్లేదు" అని ఒక అధికారి వ్యాఖ్యానించినట్లు 'జెరూసలెం పోస్ట్' పేర్కొంది.
ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే మెహర్ న్యూస్ ఏజెన్సీ 12 సెకన్ల నిడివి గల వీడియోను బయటపెట్టింది. అందులో ముజ్తాబా ఖమేనీ ప్రశాంతంగా కూర్చుని కొందరితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నారు. అయితే, ఈ వీడియో సందేహాలను నివృత్తి చేయకపోగా, కొత్త ప్రశ్నలకు తావిచ్చింది. ఇది యుద్ధం ప్రారంభం కావడానికి ముందు 'కోమ్' నగరంలో ఆయన ప్రసంగించినప్పటి పాత వీడియో అని అంతర్జాతీయ నిపుణులు, సోషల్ మీడియా వేదికగా పలువురు ఆరోపిస్తున్నారు.
తన తండ్రి మరణానంతరం సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముజ్తబా ఒక్కసారి కూడా ప్రజల ముందుకు ప్రత్యక్షంగా రాలేదు. ఇటీవల స్వయంగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కూడా సుప్రీం లీడర్తో నేరుగా సంప్రదింపులు జరపడం "చాలా కష్టంగా మారింది" అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలో, తాజా వీడియో ఆయన ఆరోగ్యంపై ప్రజల్లో ఉన్న అభద్రతాభావాన్ని తొలగించడానికి బదులు, అనుమానాలను మరింత పెంచుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కొన్ని రోజులుగా ముజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఆయనను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఇజ్రాయెల్ ‘ఛానల్ 14’ శుక్రవారం కథనాలు ప్రసారం చేసింది. ఇరాన్ అధ్యక్ష వర్గాల్లోనే ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోందని, "ఆయన వీరమరణం పొందారనే వార్త విన్నా మేం ఆశ్చర్యపోనక్కర్లేదు" అని ఒక అధికారి వ్యాఖ్యానించినట్లు 'జెరూసలెం పోస్ట్' పేర్కొంది.
ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే మెహర్ న్యూస్ ఏజెన్సీ 12 సెకన్ల నిడివి గల వీడియోను బయటపెట్టింది. అందులో ముజ్తాబా ఖమేనీ ప్రశాంతంగా కూర్చుని కొందరితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నారు. అయితే, ఈ వీడియో సందేహాలను నివృత్తి చేయకపోగా, కొత్త ప్రశ్నలకు తావిచ్చింది. ఇది యుద్ధం ప్రారంభం కావడానికి ముందు 'కోమ్' నగరంలో ఆయన ప్రసంగించినప్పటి పాత వీడియో అని అంతర్జాతీయ నిపుణులు, సోషల్ మీడియా వేదికగా పలువురు ఆరోపిస్తున్నారు.
తన తండ్రి మరణానంతరం సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముజ్తబా ఒక్కసారి కూడా ప్రజల ముందుకు ప్రత్యక్షంగా రాలేదు. ఇటీవల స్వయంగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కూడా సుప్రీం లీడర్తో నేరుగా సంప్రదింపులు జరపడం "చాలా కష్టంగా మారింది" అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలో, తాజా వీడియో ఆయన ఆరోగ్యంపై ప్రజల్లో ఉన్న అభద్రతాభావాన్ని తొలగించడానికి బదులు, అనుమానాలను మరింత పెంచుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.