ఐక్యతే మన బలం: క్విట్ ఇండియా స్ఫూర్తిపై పవన్ ట్వీట్

Unity is our strength Pawan Kalyan tweet on Quit India Movement spirit
  • క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్మరించుకున్న పవన్ కల్యాణ్ 
  • స్వాతంత్య్ర సమరయోధులకు ఘన నివాళులు
  • సిసలైన భారతావని నిర్మాణమే వారికిచ్చే గౌరవమన్న పవన్
  • ఐక్యత, సమష్టి సంకల్పమే దేశ నిజమైన బలమని వ్యాఖ్య
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ, ఆ మహోద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులర్పించారు. శనివారం ఆయన ‘ఎక్స్’ వేదికగా ఈ మేరకు తన సందేశాన్ని పంచుకున్నారు. దేశ చరిత్ర గతిని మార్చి, భారతీయ ఆత్మను మేల్కొల్పిన మహోన్నత ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమమని ఆయన కొనియాడారు.

"1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ ఇచ్చిన ‘డూ ఆర్ డై’ (సాధించు లేదా మరణించు) పిలుపు కోట్లాది మంది భారతీయుల్లో అచంచలమైన దేశభక్తిని, ధైర్యసాహసాలను నింపింది. ఈ నినాదం స్వాతంత్య్ర పోరాటాన్ని ఉవ్వెత్తున ఎగసిన జాతీయోద్యమంగా మార్చింది" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మాతృభూమి విముక్తి కోసం ప్రాణత్యాగాలు చేసిన ఆ మహనీయులకు తాను శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నట్లు తెలిపారు.

భారతదేశ వాస్తవిక శక్తి ప్రజల ఐక్యతలో, సవాళ్లను అధిగమించాలనే సమష్టి సంకల్పంలోనే ఉందని ఈ ఉద్యమం మనకు గుర్తుచేస్తోందన్నారు. పటిష్టమైన, స్వయం సమృద్ధ, అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించడం ద్వారానే ఆ వీరుల కలలకు, వారి త్యాగాలకు సరైన న్యాయం చేకూరుతుందని పవన్ కల్యాణ్ తన పోస్టులో వివరించారు.                                
Advertisement
Pawan Kalyan
Quit India Movement
Mahatma Gandhi
Do or Die call
Indian Freedom Struggle
Pawan Kalyan Tweet

More Telugu News