జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రేపల్లె నియోజకవర్గం టీడీపీ నేత

TDP leader joins YSRCP in the presence of Jagan
  • రేపల్లె నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం
  • వైసీపీలో చేరిన టీడీపీ నేత గూడపాటి శ్రీనివాసరావు
  • గూడపాటిని పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామన్న జగన్

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రేపల్లెకు చెందిన టీడీపీ నేత గూడపాటి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. గూడపాటికి వైసీపీ కండువా కప్పి జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... గూడపాటి శ్రీనివాసరావును వైసీపీ కుటుంబంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రేపల్లె నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా శ్రమించాలని పిలుపునిచ్చారు.


గూడపాటి శ్రీనివాసరావు చేరికతో రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ మరింత బలపడిందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో క్షేత్రస్థాయి బలాబలాల దృష్ట్యా రేపల్లె నియోజకవర్గ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారనుంది.

Advertisement
Gudapati Srinivasa Rao
YS Jagan Mohan Reddy
YSRCP
TDP leader joins YSRCP
Repalle Assembly Constituency
Andhra Pradesh Politics

More Telugu News