జాన్వీ కపూర్, సాయిపల్లవి, రుక్మిణి వసంత్, కయాదు లోహర్... లారెన్స్ కొత్త సినిమాలో నలుగురు టాప్ హీరోయిన్లు?
- రాఘవ లారెన్స్ 30వ సినిమాపై ఆసక్తికర ప్రచారం
- సినిమాలో నలుగురు హీరోయిన్లు అంటూ వార్తలు
- లారెన్స్ సరసన సాయి పల్లవి, జాన్వీ, రుక్మిణి, కయాదు
- ఇది లారెన్స్ సొంత నిర్మాణ సంస్థలో రానున్న చిత్రం
- నూతన దర్శకుడు తిరుపుగల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న వైనం
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన కెరీర్లో మైలురాయిగా నిలిచే 30వ సినిమాకు సిద్ధమవుతున్నారు. 'RL-30' అనే వర్కింగ్ టైటిల్తో ఈ ప్రాజెక్ట్ను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే, సినిమా ప్రారంభం కాకముందే దీని క్యాస్టింగ్ సంచలనంగా మారింది. ఈ చిత్రంలో ఒకరు కాదు, ఏకంగా నలుగురు ప్రముఖ హీరోయిన్లు నటించనున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఈ భారీ చిత్రంలో సాయి పల్లవి, జాన్వీ కపూర్, రుక్మిణి వసంత్, కయాదు లోహర్ కీలక పాత్రలు పోషించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నలుగురు నటీమణులకు ఉన్న క్రేజ్ దృష్ట్యా సౌత్ ఇండియన్ సినిమాలో ఇది చర్చనీయాంశం అయింది. దాంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఈ చిత్రాన్ని రాఘవ లారెన్స్ తన సొంత నిర్మాణ సంస్థ 'రాఘవేంద్ర ప్రొడక్షన్స్' బ్యానర్పై నిర్మిస్తుండటం విశేషం. తిరుపుగల్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై హీరోయిన్ల వార్తలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపైంది.
ఈ భారీ చిత్రంలో సాయి పల్లవి, జాన్వీ కపూర్, రుక్మిణి వసంత్, కయాదు లోహర్ కీలక పాత్రలు పోషించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నలుగురు నటీమణులకు ఉన్న క్రేజ్ దృష్ట్యా సౌత్ ఇండియన్ సినిమాలో ఇది చర్చనీయాంశం అయింది. దాంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఈ చిత్రాన్ని రాఘవ లారెన్స్ తన సొంత నిర్మాణ సంస్థ 'రాఘవేంద్ర ప్రొడక్షన్స్' బ్యానర్పై నిర్మిస్తుండటం విశేషం. తిరుపుగల్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై హీరోయిన్ల వార్తలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపైంది.