తునిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్లకు అంతరాయం
- తుని వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
- గరీబ్ రథ్ సహా పలు ప్యాసింజర్ రైళ్లు ఆలస్యం
- ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైన రైల్వే సిబ్బంది
కాకినాడ జిల్లా తునిలో గురువారం సాయంత్రం ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం కారణంగా అత్యంత రద్దీగా ఉండే విశాఖపట్నం - విజయవాడ రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఈ గూడ్స్ రైలు, తుని పట్టణం దాటిన తర్వాత లూప్ లైన్లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. రైలులోని ఒక బోగీ అదుపుతప్పి పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడం, ప్రాణ నష్టం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాద ప్రభావంతో విశాఖపట్నం - మహబూబ్నగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖ - సికింద్రాబాద్ గరీబ్ రథ్, ఎర్నాకుళం ఎక్స్ప్రెస్తో పాటు పలు ఇతర రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఈ గూడ్స్ రైలు, తుని పట్టణం దాటిన తర్వాత లూప్ లైన్లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. రైలులోని ఒక బోగీ అదుపుతప్పి పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడం, ప్రాణ నష్టం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాద ప్రభావంతో విశాఖపట్నం - మహబూబ్నగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖ - సికింద్రాబాద్ గరీబ్ రథ్, ఎర్నాకుళం ఎక్స్ప్రెస్తో పాటు పలు ఇతర రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.