గుడిలో డ్యాన్స్ రీల్.. యువతిని అడ్డుకున్న పోలీస్.. వైరల్ వీడియో
- సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఘటనకు సంబంధించిన వీడియో
- పోలీసు చర్యను సమర్థిస్తున్న నెటిజన్లు
- ఆలయ పవిత్రత ముఖ్యమన్న అభిప్రాయం
ఓ ఆలయ ప్రాంగణంలో యువతి డ్యాన్స్ రీల్ చిత్రీకరిస్తుండగా, ఒక పోలీస్ అధికారి ఆమెను అడ్డుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనతో పుణ్యక్షేత్రాల్లో కంటెంట్ క్రియేషన్, సందర్శకుల ప్రవర్తనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఆ వీడియో ప్రకారం, సదరు యువతి ఆలయం ప్రాంగణంలోని భక్తుల మధ్య నిలబడి మొబైల్ ఫోన్ సాక్షిగా డ్యాన్స్ చేస్తోంది. అది గమనించిన ఓ పోలీస్ అధికారి వెంటనే జోక్యం చేసుకుని, ఆమెను క్యూ లైన్ నుంచి పక్కకు రావాల్సిందిగా ఆదేశించి నృత్యాన్ని ఆపించారు. అయితే, ఆ వీడియోలో ఆడియో స్పష్టంగా లేకపోవడంతో వారి మధ్య జరిగిన సంభాషణ ఏమిటనేది తెలియరాలేదు. అలాగే, ఈ ఘటన ఏ ఆలయంలో జరిగిందన్న విషయంపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యధికులు పోలీస్ అధికారి చర్యను సమర్థించగా, ఆలయాలు దైవ ప్రార్థనలకు, భక్తికి నిలయాలని, అటువంటి పవిత్ర స్థలాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడటం సంప్రదాయాలను అగౌరవపరచడమేనని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత 'రీల్ కల్చర్' భక్తి కంటే ప్రాచుర్యం పొందేందుకే ప్రాధాన్యత ఇస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. చార్ ధామ్ వంటి పుణ్యక్షేత్రాల్లో అమలవుతున్న కఠిన నిబంధనలను అన్ని ప్రధాన ఆలయాల్లోనూ అమలు చేయాలనే డిమాండ్లు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి.
ఆ వీడియో ప్రకారం, సదరు యువతి ఆలయం ప్రాంగణంలోని భక్తుల మధ్య నిలబడి మొబైల్ ఫోన్ సాక్షిగా డ్యాన్స్ చేస్తోంది. అది గమనించిన ఓ పోలీస్ అధికారి వెంటనే జోక్యం చేసుకుని, ఆమెను క్యూ లైన్ నుంచి పక్కకు రావాల్సిందిగా ఆదేశించి నృత్యాన్ని ఆపించారు. అయితే, ఆ వీడియోలో ఆడియో స్పష్టంగా లేకపోవడంతో వారి మధ్య జరిగిన సంభాషణ ఏమిటనేది తెలియరాలేదు. అలాగే, ఈ ఘటన ఏ ఆలయంలో జరిగిందన్న విషయంపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యధికులు పోలీస్ అధికారి చర్యను సమర్థించగా, ఆలయాలు దైవ ప్రార్థనలకు, భక్తికి నిలయాలని, అటువంటి పవిత్ర స్థలాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడటం సంప్రదాయాలను అగౌరవపరచడమేనని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత 'రీల్ కల్చర్' భక్తి కంటే ప్రాచుర్యం పొందేందుకే ప్రాధాన్యత ఇస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. చార్ ధామ్ వంటి పుణ్యక్షేత్రాల్లో అమలవుతున్న కఠిన నిబంధనలను అన్ని ప్రధాన ఆలయాల్లోనూ అమలు చేయాలనే డిమాండ్లు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి.