30 దాటిందా? అయినా సంపద సృష్టించొచ్చు.. నిపుణుల సూపర్ టిప్స్!
- 30, 40 ఏళ్లలోనూ పెట్టుబడులు ప్రారంభించొచ్చని నిపుణుల సూచన.
- ప్రతి ఏడాది 15 శాతం జీతం పెంపు కోరాలని సలహా
- ఆదాయంలో 40 శాతం పొదుపు, పెట్టుబడులకు కేటాయించాలని సూచన
- దీర్ఘకాల పెట్టుబడులపై దృష్టి పెట్టాలని హితవు
- అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని సూచన
చిన్న వయసులోనే పెట్టుబడులు మొదలుపెట్టాలని ఆర్థిక నిపుణులు తరచూ సూచిస్తుంటారు. దీంతో 30 లేదా 40 ఏళ్ల వయసులో పెట్టుబడులు ప్రారంభించే చాలామందికి ఆలస్యమైందనే భావన కలుగుతుంది. అయితే మాజీ వాల్స్ట్రీట్ ట్రేడర్, ఆర్థిక నిపుణురాలు వివియన్ టూ మాత్రం అలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. సరైన ప్రణాళికతో ముందుకెళితే ఈ వయసులో కూడా ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చని ఆమె సూచించారు.
జీతం పెంచమని అడగాలి
30, 40 ఏళ్ల వయసులో చాలా మంది తమ ఆదాయం పెరిగే దశలో ఉంటారని వివియన్ టూ చెప్పారు. అలాంటి సమయంలో యాజమాన్యాన్ని జీతం పెంచండని అడగడానికి భయపడొద్దని సూచించారు. ప్రతి ఏడాది కనీసం 15 శాతం వేతన పెంపు కోరాలని చెప్పారు. చిన్న వయసులో పెట్టుబడులు ప్రారంభించకపోయినా, ఈ దశలో ఆదాయాన్ని వేగంగా పెంచుకోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేసే అవకాశం ఉంటుందని వివరించారు.
పొదుపే ప్రధాన ఆయుధం
ఖర్చులపై కచ్చితమైన నియంత్రణ అవసరమని వివియన్ టూ పేర్కొన్నారు. సాధారణంగా ఆదాయంలో 50 శాతం అవసరాలకు, 30 శాతం వ్యక్తిగత కోరికలకు, 20 శాతం పొదుపునకు కేటాయించాలని సూచిస్తారు. అయితే ఆలస్యంగా పెట్టుబడులు ప్రారంభించిన వారు పొదుపు, పెట్టుబడుల వాటాను 40 శాతానికి పెంచాలని ఆమె సూచించారు. ఇందుకోసం అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలని చెప్పారు.
దీర్ఘకాల పెట్టుబడులపై దృష్టి
రిటైర్మెంట్ కోసం ప్రత్యేకంగా పెట్టుబడులు పెట్టాలని వివియన్ టూ సూచించారు. అలాగే ఒక్కో కంపెనీ షేర్లను ఎంచుకోవడం కంటే వివిధ రంగాల్లో పెట్టుబడులు ఉండే ఇండెక్స్ ఫండ్లు, బాండ్ల వంటి మార్గాలను ఎంచుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల విషయంలో చిన్న మొత్తాలతో ప్రారంభించినా సరిపోతుందని, ఆలస్యం చేయకుండా మొదలుపెట్టడమే ముఖ్యమని చెప్పారు.
కొనేముందు ఒక్కసారి ఆలోచించండి
చాలామంది అవసరం లేకపోయినా ఇతరులను ఆకట్టుకోవడానికి వస్తువులు కొనుగోలు చేస్తుంటారని వివియన్ టూ చెప్పారు. ఏ వస్తువైనా కొనేముందు అది నిజంగా అవసరమా? లేక ఇతరులకు చూపించడానికే కొంటున్నామా? అని ఒక్కసారి తమను తాము ప్రశ్నించుకోవాలని సూచించారు. అనవసర ఖర్చులు తగ్గితేనే పొదుపు పెరుగుతుందని, అప్పుల బారిన పడకుండా ఉండొచ్చని వివరించారు.
జీతం పెంచమని అడగాలి
30, 40 ఏళ్ల వయసులో చాలా మంది తమ ఆదాయం పెరిగే దశలో ఉంటారని వివియన్ టూ చెప్పారు. అలాంటి సమయంలో యాజమాన్యాన్ని జీతం పెంచండని అడగడానికి భయపడొద్దని సూచించారు. ప్రతి ఏడాది కనీసం 15 శాతం వేతన పెంపు కోరాలని చెప్పారు. చిన్న వయసులో పెట్టుబడులు ప్రారంభించకపోయినా, ఈ దశలో ఆదాయాన్ని వేగంగా పెంచుకోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేసే అవకాశం ఉంటుందని వివరించారు.
పొదుపే ప్రధాన ఆయుధం
ఖర్చులపై కచ్చితమైన నియంత్రణ అవసరమని వివియన్ టూ పేర్కొన్నారు. సాధారణంగా ఆదాయంలో 50 శాతం అవసరాలకు, 30 శాతం వ్యక్తిగత కోరికలకు, 20 శాతం పొదుపునకు కేటాయించాలని సూచిస్తారు. అయితే ఆలస్యంగా పెట్టుబడులు ప్రారంభించిన వారు పొదుపు, పెట్టుబడుల వాటాను 40 శాతానికి పెంచాలని ఆమె సూచించారు. ఇందుకోసం అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలని చెప్పారు.
దీర్ఘకాల పెట్టుబడులపై దృష్టి
రిటైర్మెంట్ కోసం ప్రత్యేకంగా పెట్టుబడులు పెట్టాలని వివియన్ టూ సూచించారు. అలాగే ఒక్కో కంపెనీ షేర్లను ఎంచుకోవడం కంటే వివిధ రంగాల్లో పెట్టుబడులు ఉండే ఇండెక్స్ ఫండ్లు, బాండ్ల వంటి మార్గాలను ఎంచుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల విషయంలో చిన్న మొత్తాలతో ప్రారంభించినా సరిపోతుందని, ఆలస్యం చేయకుండా మొదలుపెట్టడమే ముఖ్యమని చెప్పారు.
కొనేముందు ఒక్కసారి ఆలోచించండి
చాలామంది అవసరం లేకపోయినా ఇతరులను ఆకట్టుకోవడానికి వస్తువులు కొనుగోలు చేస్తుంటారని వివియన్ టూ చెప్పారు. ఏ వస్తువైనా కొనేముందు అది నిజంగా అవసరమా? లేక ఇతరులకు చూపించడానికే కొంటున్నామా? అని ఒక్కసారి తమను తాము ప్రశ్నించుకోవాలని సూచించారు. అనవసర ఖర్చులు తగ్గితేనే పొదుపు పెరుగుతుందని, అప్పుల బారిన పడకుండా ఉండొచ్చని వివరించారు.