ముద్రగడ పద్మనాభం ఇక లేరని తెలిసి చింతిస్తున్నాను: పవన్ కల్యాణ్

Deeply saddened by the demise of Mudragada Padmanabham says Pawan Kalyan
  • మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
  • ఆయన మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్
  • నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసిన ముద్రగడ
  • కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు పవన్ ప్రగాఢ సానుభూతి
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

పవన్ కల్యాణ్ తన సంతాప సందేశంలో, "మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు తుదిశ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలి" అని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ముద్రగడ రాజకీయ సేవలను పవన్ గుర్తుచేసుకున్నారు. 1978లో తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన, మొత్తం నాలుగుసార్లు శాసనసభకు, ఒకసారి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారని వివరించారు.

ముద్రగడ పద్మనాభం అర్ధాంగి, కుమారుడు, కుమార్తెతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు, ఆయన మద్దతుదారులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Advertisement
Mudragada Padmanabham
Pawan Kalyan
Kapu Movement Leader
Andhra Pradesh Politics
Kakinada MP
Mudragada Padmanabham Demise

More Telugu News