ప్రపంచ నేతలే లక్ష్యంగా ఇరాన్ హిట్లిస్ట్..? జాబితాలో ట్రంప్, మెలోనీ, మెక్రాన్ పేర్లు!
- అమెరికా, యూరప్ నేతలే లక్ష్యంగా హిట్లిస్ట్ ప్రచురించిన ఇరాన్ పత్రిక
- అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగానే ఈ జాబితా అంటూ ప్రకటన
- ప్రతీకారం తీర్చుకుంటామని, నేరస్థుల జాబితా సిద్ధంగా ఉందని మొజ్తబా ఖమేనీ హెచ్చరిక
- జాబితాలో ట్రంప్, నెతన్యాహు, మెక్రాన్ సహా 13 మంది ప్రముఖులు
- ఇది పత్రిక ప్రచురించిన జాబితానే కానీ, అధికారికం కాదని వెల్లడి
ఇరాన్లో ఓ ప్రముఖ వార్తాపత్రిక ప్రచురించిన కథనం అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరాన్ దివంగత మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాల అధినేతలే లక్ష్యంగా ఒక 'హిట్లిస్ట్'ను ఆ పత్రిక విడుదల చేసింది. రాజధాని టెహ్రాన్ అధికార వర్గాల ఆధ్వర్యంలో నడిచే 'హమ్షహ్రీ' అనే వార్తాపత్రిక 13 మంది విదేశీ నేతల ఫొటోలతో కూడిన ఒక ఇన్ఫోగ్రాఫిక్ను నిన్న రాత్రి ఆన్లైన్లో ప్రచురించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఫిబ్రవరి 28న మధ్యప్రాచ్య యుద్ధం మొదటి రోజున అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన కుమారుడు మొజ్తబా ఖమేనీ ప్రతీకార ప్రతిజ్ఞ చేశారు. "ప్రతీకారం తీర్చుకోవడం మా జాతి సంకల్పం. అది కచ్చితంగా నెరవేరుతుంది. జాబితాలో పేర్లున్న ఈ నేరస్థులు.. మంచం మీదే ప్రశాంతంగా చనిపోవాలన్న కోరికను తమతో పాటే సమాధిలోకి తీసుకువెళతారు" అని తన తండ్రి అంత్యక్రియల తర్వాత మొజ్తబా హెచ్చరించారు. అయితే, ఆయన తన సందేశంలో ఎవరి పేర్లనూ బయటపెట్టలేదు.
'హమ్షహ్రీ' పత్రిక విడుదల చేసిన జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, బ్రిటన్ ఆపద్ధర్మ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ల పేర్లు ఉన్నాయి. వీరితో పాటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే, పత్రిక ప్రింట్ ఎడిషన్లో ఈ జాబితా కనిపించకపోవడం గమనార్హం. ఇది కేవలం పత్రిక ప్రచురించిన జాబితానే తప్ప, ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది కాదని తెలుస్తోంది.
యుద్ధ సమయంలో తమ భూభాగంపై జరిగిన దాడులను ఖండించడంలో యూరప్ దేశాలు విఫలమయ్యాయని, అమెరికా సైనిక విమానాలకు తమ గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతినిచ్చి ఆ నేరంలో పాలుపంచుకున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా, యుద్ధానికి ముందు నుంచే కనిపించకుండా పోయిన మొజ్తబా ఖమేనీ.. తన తండ్రిపై జరిగిన దాడుల్లో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఫిబ్రవరి 28న మధ్యప్రాచ్య యుద్ధం మొదటి రోజున అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన కుమారుడు మొజ్తబా ఖమేనీ ప్రతీకార ప్రతిజ్ఞ చేశారు. "ప్రతీకారం తీర్చుకోవడం మా జాతి సంకల్పం. అది కచ్చితంగా నెరవేరుతుంది. జాబితాలో పేర్లున్న ఈ నేరస్థులు.. మంచం మీదే ప్రశాంతంగా చనిపోవాలన్న కోరికను తమతో పాటే సమాధిలోకి తీసుకువెళతారు" అని తన తండ్రి అంత్యక్రియల తర్వాత మొజ్తబా హెచ్చరించారు. అయితే, ఆయన తన సందేశంలో ఎవరి పేర్లనూ బయటపెట్టలేదు.
'హమ్షహ్రీ' పత్రిక విడుదల చేసిన జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, బ్రిటన్ ఆపద్ధర్మ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ల పేర్లు ఉన్నాయి. వీరితో పాటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే, పత్రిక ప్రింట్ ఎడిషన్లో ఈ జాబితా కనిపించకపోవడం గమనార్హం. ఇది కేవలం పత్రిక ప్రచురించిన జాబితానే తప్ప, ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది కాదని తెలుస్తోంది.
యుద్ధ సమయంలో తమ భూభాగంపై జరిగిన దాడులను ఖండించడంలో యూరప్ దేశాలు విఫలమయ్యాయని, అమెరికా సైనిక విమానాలకు తమ గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతినిచ్చి ఆ నేరంలో పాలుపంచుకున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా, యుద్ధానికి ముందు నుంచే కనిపించకుండా పోయిన మొజ్తబా ఖమేనీ.. తన తండ్రిపై జరిగిన దాడుల్లో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.