ఇరాన్పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.. శాంతి ఒప్పందానికి ట్రంప్ చెల్లుచీటి!
- ఇరాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడిన అమెరికా
- తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిందన్న ట్రంప్
- బందర్ అబ్బాస్, చాబహార్ సహా పలు నగరాల్లో పేలుళ్లు
- యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ ఎదురుదాడి హెచ్చరికలు
- అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన బ్రెంట్ క్రూడ్ ధరలు
పశ్చిమాసియాలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా పరాకాష్ఠకు చేరుకున్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను అడ్డుకుంటున్న ఇరాన్పై బుధవారం రాత్రి అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా ‘ముగిసిపోయింది’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ దాడులు ప్రారంభించింది.
టర్కీలోని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఇరాన్లోని పేలుళ్లకు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఈ హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ.. "నేను చిన్న హెచ్చరిక ఇస్తున్నాను.. ఈ రాత్రి ఇరాన్ను చాలా గట్టిగా కొట్టబోతున్నాం" అని వ్యాఖ్యానించారు. జూన్ 17న కుదిరిన అవగాహన ఒప్పందం పూర్తిగా విఫలమైందని, ఇరాన్ పాలకులు నమ్మదగిన వ్యక్తులు కారని ఆయన మండిపడ్డారు. అయితే ఈ ఘర్షణలు సుదీర్ఘ కాలం కొనసాగవని, అమెరికా సైన్యం ఈ పనిని చాలా వేగంగా ముగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అమెరికా దాడులతో ఇరాన్ దక్షిణ తీర ప్రాంతం వణికిపోయింది. ఇరాన్ అతిపెద్ద నౌకాశ్రయం, ఇరాన్ నావికాదళం, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రధాన స్థావరమైన 'బందర్ అబ్బాస్' నగరంలో వాయు రక్షణ వ్యవస్థ క్రియాశీలం అయినప్పటికీ కనీసం ఎనిమిది భారీ పేలుళ్లు సంభవించాయి. చాబహార్, కొనారక్ ప్రాంతాలలో 10 కి పైగా పేలుళ్లు జరిగాయి, దీనివల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాకుండా చాబహార్లోని షాహిద్ బెహెష్తీ పోర్ట్, కలాంతరి పోర్ట్, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్షిపణుల శకలాలు చాబహార్లోని ఒక ఆసుపత్రిని కూడా తాకినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఇరాన్షాహర్, సిరిక్, బుషెహర్, అబు మూసా దీవులపై కూడా అమెరికా దాడులు జరిగాయి.
ఈ పరిణామాలపై ఇరాన్ అత్యున్నత భద్రతా సంస్థకు చెందిన నూర్న్యూస్ స్పందిస్తూ.. ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ "భారీ ప్రతిఘటన దాడి"కి సిద్ధమవుతున్నట్లు సైనిక వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల భద్రతా బాధ్యత ఇరాన్దేనని ఒప్పందంలో ఉందని, అమెరికా దానిని ఉల్లంఘించిందని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇరాన్ ఇప్పటికే బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా మిలటరీ స్థావరాలపై దాడులు చేసింది. ఈ యుద్ధ మేఘాల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్పై తక్షణమే పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు ఒక డాలర్ పెరిగి 79.28 డాలర్లకు చేరుకుంది.
టర్కీలోని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఇరాన్లోని పేలుళ్లకు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఈ హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ.. "నేను చిన్న హెచ్చరిక ఇస్తున్నాను.. ఈ రాత్రి ఇరాన్ను చాలా గట్టిగా కొట్టబోతున్నాం" అని వ్యాఖ్యానించారు. జూన్ 17న కుదిరిన అవగాహన ఒప్పందం పూర్తిగా విఫలమైందని, ఇరాన్ పాలకులు నమ్మదగిన వ్యక్తులు కారని ఆయన మండిపడ్డారు. అయితే ఈ ఘర్షణలు సుదీర్ఘ కాలం కొనసాగవని, అమెరికా సైన్యం ఈ పనిని చాలా వేగంగా ముగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అమెరికా దాడులతో ఇరాన్ దక్షిణ తీర ప్రాంతం వణికిపోయింది. ఇరాన్ అతిపెద్ద నౌకాశ్రయం, ఇరాన్ నావికాదళం, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రధాన స్థావరమైన 'బందర్ అబ్బాస్' నగరంలో వాయు రక్షణ వ్యవస్థ క్రియాశీలం అయినప్పటికీ కనీసం ఎనిమిది భారీ పేలుళ్లు సంభవించాయి. చాబహార్, కొనారక్ ప్రాంతాలలో 10 కి పైగా పేలుళ్లు జరిగాయి, దీనివల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాకుండా చాబహార్లోని షాహిద్ బెహెష్తీ పోర్ట్, కలాంతరి పోర్ట్, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్షిపణుల శకలాలు చాబహార్లోని ఒక ఆసుపత్రిని కూడా తాకినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఇరాన్షాహర్, సిరిక్, బుషెహర్, అబు మూసా దీవులపై కూడా అమెరికా దాడులు జరిగాయి.
ఈ పరిణామాలపై ఇరాన్ అత్యున్నత భద్రతా సంస్థకు చెందిన నూర్న్యూస్ స్పందిస్తూ.. ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ "భారీ ప్రతిఘటన దాడి"కి సిద్ధమవుతున్నట్లు సైనిక వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల భద్రతా బాధ్యత ఇరాన్దేనని ఒప్పందంలో ఉందని, అమెరికా దానిని ఉల్లంఘించిందని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇరాన్ ఇప్పటికే బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా మిలటరీ స్థావరాలపై దాడులు చేసింది. ఈ యుద్ధ మేఘాల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్పై తక్షణమే పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు ఒక డాలర్ పెరిగి 79.28 డాలర్లకు చేరుకుంది.