ఏపీలో ఫుట్వేర్ హబ్కు అడుగులు.. హ్వాసంగ్కు లోకేశ్ కీలక ప్రతిపాదనలు
- బుసాన్లో హ్వాసంగ్ ప్రతినిధులతో లోకేశ్ భేటీ
- కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఫుట్వేర్ క్లస్టర్ ప్రతిపాదన
- ఏపీలో ఆర్అండ్డీ, ఇన్నోవేషన్ సెంటర్ కోరిన మంత్రి
- దక్షిణ భారత తయారీ క్లస్టర్పై ప్రత్యేక ప్రతిపాదన
- కుప్పంలో రూ.900 కోట్ల ప్లాంట్ను గుర్తు చేసిన హ్వాసంగ్
- ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని కంపెనీ హామీ
దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్.. ప్రముఖ హ్వాసంగ్ గ్రూప్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో బుసాన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఫుట్వేర్ తయారీ రంగాన్ని మరింత విస్తరించేలా పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
కుప్పంలో హ్వాసంగ్ ఫుట్వేర్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు కంపెనీ ప్రతినిధులకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. అదే ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ ఫుట్వేర్ కాంపొనెంట్, మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయని వివరించారు.
ప్రీమియం బ్రాండ్ల కోసం పెర్ఫార్మెన్స్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత కస్టమైజేషన్, సస్టెయినబుల్ మెటీరియల్స్పై పరిశోధనలు జరిగే నెక్స్ట్ జనరేషన్ అథ్లెటిక్ ఫుట్వేర్ ఆర్అండ్డీ, ఆసియా-పసిఫిక్ ఇన్నోవేషన్ సెంటర్ను కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు సేవలందించేలా సమగ్ర దక్షిణ భారత తయారీ క్లస్టర్ను అభివృద్ధి చేయాలని లోకేశ్ ప్రతిపాదించారు. ఇందులో కుప్పంలో ప్రధాన కార్యాలయం, తిరుపతిలో విడిభాగాల తయారీ కేంద్రం, విశాఖపట్నంలో డిజైన్, కార్పొరేట్, లాజిస్టిక్స్ విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే హ్వాసంగ్ ఫుట్వేర్కు చెందిన టైర్-1, టైర్-2 విక్రేతలతో ఏపీలో సప్లయర్ సమావేశం నిర్వహించాలని కోరారు.
సమావేశంలో హ్వాసంగ్ కార్పొరేషన్ బిజినెస్ సీఈవో హెయో సియోంగ్-రియోంగ్ స్పందించారు. కుప్పంలో రూ.900 కోట్ల పెట్టుబడితో గ్రీన్ఫీల్డ్ నాన్-లెదర్ ఫుట్వేర్ ప్లాంట్ను ఇప్పటికే ప్రకటించినట్లు తెలిపారు. అడిడాస్తో పాటు పలు అంతర్జాతీయ బ్రాండ్లకు ఓఈఎం సరఫరాదారుగా ఉన్న ఈ ప్లాంట్లో ఏడాదికి 2 కోట్ల జతల స్పోర్ట్స్ షూలను తయారు చేయనున్నట్లు చెప్పారు.
మొదట ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుని ఉత్పత్తి ప్రారంభిస్తామని, తర్వాత దేశీయ మార్కెట్కు కూడా విస్తరిస్తామని వెల్లడించారు. పుణే, చెన్నై, అనంతపురం జిల్లా గూడపల్లిలో ఆటో విడిభాగాల తయారీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
కుప్పంలో హ్వాసంగ్ ఫుట్వేర్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు కంపెనీ ప్రతినిధులకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. అదే ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ ఫుట్వేర్ కాంపొనెంట్, మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయని వివరించారు.
ప్రీమియం బ్రాండ్ల కోసం పెర్ఫార్మెన్స్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత కస్టమైజేషన్, సస్టెయినబుల్ మెటీరియల్స్పై పరిశోధనలు జరిగే నెక్స్ట్ జనరేషన్ అథ్లెటిక్ ఫుట్వేర్ ఆర్అండ్డీ, ఆసియా-పసిఫిక్ ఇన్నోవేషన్ సెంటర్ను కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు సేవలందించేలా సమగ్ర దక్షిణ భారత తయారీ క్లస్టర్ను అభివృద్ధి చేయాలని లోకేశ్ ప్రతిపాదించారు. ఇందులో కుప్పంలో ప్రధాన కార్యాలయం, తిరుపతిలో విడిభాగాల తయారీ కేంద్రం, విశాఖపట్నంలో డిజైన్, కార్పొరేట్, లాజిస్టిక్స్ విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే హ్వాసంగ్ ఫుట్వేర్కు చెందిన టైర్-1, టైర్-2 విక్రేతలతో ఏపీలో సప్లయర్ సమావేశం నిర్వహించాలని కోరారు.
సమావేశంలో హ్వాసంగ్ కార్పొరేషన్ బిజినెస్ సీఈవో హెయో సియోంగ్-రియోంగ్ స్పందించారు. కుప్పంలో రూ.900 కోట్ల పెట్టుబడితో గ్రీన్ఫీల్డ్ నాన్-లెదర్ ఫుట్వేర్ ప్లాంట్ను ఇప్పటికే ప్రకటించినట్లు తెలిపారు. అడిడాస్తో పాటు పలు అంతర్జాతీయ బ్రాండ్లకు ఓఈఎం సరఫరాదారుగా ఉన్న ఈ ప్లాంట్లో ఏడాదికి 2 కోట్ల జతల స్పోర్ట్స్ షూలను తయారు చేయనున్నట్లు చెప్పారు.
మొదట ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుని ఉత్పత్తి ప్రారంభిస్తామని, తర్వాత దేశీయ మార్కెట్కు కూడా విస్తరిస్తామని వెల్లడించారు. పుణే, చెన్నై, అనంతపురం జిల్లా గూడపల్లిలో ఆటో విడిభాగాల తయారీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.