85 వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు: జగన్
- మధ్యాహ్న భోజనం వండుతున్న వారి జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారన్న జగన్
- స్మార్ట్ కిచెన్స్ పేరుతో వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారని మండిపాటు
- వారికి బకాయి పెట్టిన జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.వేయి ఉండే జీతాన్ని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. 3 వేల వరకు పెంచామని జగన్ తెలిపారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే మరింత మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు స్మార్ట్ కిచెన్స్ పేరుతో వారిని తొలగించి వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారని విమర్శించారు. మధ్యాహ్న భోజన కార్మికుల తరఫున పోరాడుతామని, వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే బకాయిపెట్టిన వారి జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట మేరకు వారి జీతాలను కూడా పెంచాలని అన్నారు.