ఆసుపత్రిలో ముద్రగడను పరామర్శించిన బొత్స, తోట త్రిమూర్తులు
- కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ముద్రగడ
- హైదరాబాద్ లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేత
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన బొత్స, తోట త్రిమూర్తులు
ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈరోజు ఆసుపత్రికి వెళ్లారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల నుంచి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముద్రగడ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం పట్ల వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.