ఆర్‌సీబీ అభిమానులకు అన్యాయం జరిగింది: ఫైనల్ వేదిక మార్చడంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

DK Shivakumar Says Injustice to RCB Fans Over Final Venue
  • ఫైనల్‌లో జీటీని ఓడించి ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ
  • వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన మూడో జట్టుగా రికార్డ్
  • ఈ మ్యాచ్ వేదిక మార్చ‌డంపై రాజ‌కీయ వివాదం
  • రాజకీయ కారణాలతోనే ఫైనల్‌ను బెంగళూరు నుంచి తరలించారన్న డీకే శివకుమార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి, వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగి, ఐపీఎల్‌లో తన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో ఆర్సీబీ సునాయాసంగా విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ, విరాట్ కోహ్లీ వీర విహారంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ, మొత్తం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి వెంకటేశ్ అయ్యర్ (32) నుంచి మంచి సహకారం లభించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత వరుసగా రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. 2025లో కూడా ఆర్సీబీ తమ తొలి టైటిల్‌ను అహ్మదాబాద్‌లోనే గెలుచుకోవడం విశేషం.

ఈ విజయంపై కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ.. రాజకీయ కారణాల వల్లే ఫైనల్ మ్యాచ్‌ను బెంగళూరు నుంచి గుజరాత్‌కు తరలించారని ఆరోపించారు. "నిజానికి ఆర్సీబీ మ్యాచ్ బెంగళూరులో జరగాల్సింది. మా అభిమానుల‌కు అన్యాయం జరిగింది. రాజకీయాల కారణంగా వాళ్లు మ్యాచ్‌ను అక్కడికి తీసుకెళ్లారు. దీనిపై ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడను" అని ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఆర్సీబీ ఆటగాళ్లకు, జట్టుకు కర్ణాటక ప్రజల తరఫున ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

2022లో ఇదే స్టేడియంలో ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఈసారి మాత్రం నిరాశపరిచింది. ఆర్సీబీ బౌలర్ల క్రమశిక్షణతో కూడిన బౌలింగ్, అలాగే కేవలం ఆరు రోజుల్లో మూడు వేర్వేరు వేదికలలో మూడు మ్యాచ్‌లు ఆడటం వంటి కఠినమైన షెడ్యూల్ వారి ఓటమికి కారణాలుగా నిలిచాయి.
Go Back to Shorts
DK Shivakumar
RCB
Royal Challengers Bangalore
IPL Final
Narendra Modi Stadium
Virat Kohli
Gujarat Titans
IPL 2024
Bengaluru
Karnataka

More Telugu News