సిద్ధరామయ్య అందుకే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటున్నారు: కర్ణాటక కాంగ్రెస్ నేత సతీశ్ జర్కిహోళి
- సిద్ధరామయ్య రాజీనామా తర్వాత డీకే శివకుమార్ సీఎం కావడం ఖాయమని వ్యాఖ్య
- ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిందన్న సతీశ్
- ఈ విషయాన్ని సిద్ధరామయ్య కూడా ప్రకటించారని వెల్లడి
- రాజ్యసభ సీటును సిద్ధరామయ్య తిరస్కరించారన్న కాంగ్రెస్ నాయకుడు
- 2028లో కాంగ్రెస్ను అధికారంలోకి తేవడమే తన లక్ష్యమని సిద్ధరామయ్య చెప్పారని వెల్లడి
కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత సతీశ్ జర్కిహోళి కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదని తేల్చిచెప్పారు. సిద్ధరామయ్య కూడా వచ్చే ఎన్నికల్లో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటున్నారని అభిప్రాయపడ్డారు.
"సిద్ధరామయ్య రాజీనామా తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారన్నది తథ్యం. తదుపరి సీఎం డీకే శివకుమారేనని కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా సిద్ధరామయ్య కూడా ప్రకటించారు" అని అన్నారు. సిద్ధరామయ్య హయాంలో జరిగిన మంచి పనులు డీకే నాయకత్వంలో కూడా కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సవాలును తమ కాబోయే ముఖ్యమంత్రి సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సిద్ధరామయ్య భవిష్యత్ ప్రణాళికల గురించి కూడా ఆయన మాట్లాడారు. "అధిష్ఠానం ఆయనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసింది, కానీ ఆయన తిరస్కరించారు. తాను రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని, 2028లో కాంగ్రెస్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు" అని వివరించారు. ఇక సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు కేబినెట్లో స్థానం కల్పించడంపై అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
"సిద్ధరామయ్య రాజీనామా తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారన్నది తథ్యం. తదుపరి సీఎం డీకే శివకుమారేనని కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా సిద్ధరామయ్య కూడా ప్రకటించారు" అని అన్నారు. సిద్ధరామయ్య హయాంలో జరిగిన మంచి పనులు డీకే నాయకత్వంలో కూడా కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సవాలును తమ కాబోయే ముఖ్యమంత్రి సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సిద్ధరామయ్య భవిష్యత్ ప్రణాళికల గురించి కూడా ఆయన మాట్లాడారు. "అధిష్ఠానం ఆయనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసింది, కానీ ఆయన తిరస్కరించారు. తాను రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని, 2028లో కాంగ్రెస్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు" అని వివరించారు. ఇక సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు కేబినెట్లో స్థానం కల్పించడంపై అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.