దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

K Shanti Judicial Remand Extended in Disproportionate Assets Case
  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెండైన శాంతి
  • ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్న వైనం
  • జూన్ 2 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీపీ ప్రత్యేక కోర్టు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ దేవాదాయ శాఖ సస్పెండెడ్ అసిస్టెంట్ కమిషనర్ కే. శాంతికి ఏసీబీ ప్రత్యేక కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను కోర్టు జూన్ 2 వరకు పొడిగించింది. జైలు నుంచి బయటకు వచ్చేందుకు శాంతి రెండు సార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ.. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న ఏసీబీ న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమె బెయిల్‌ను తిరస్కరించింది. 

గతంలో జరిగిన ఏసీబీ దాడుల్లో, నిబంధనలకు విరుద్ధంగా సంపాదించిన కోట్లాది రూపాయల విలువైన బినామీ ఆస్తులు, భూముల పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా రిమాండ్ పొడిగింపుతో ఆమె జైలులోనే మరికొన్ని రోజులు గడపక తప్పడం లేదు. ప్రస్తుతం ఆమె విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు.
Go Back to Shorts
K Shanti
K Shanti ACB
Assistant Commissioner K Shanti
Devadaya Department AP
Disproportionate Assets Case
ACB Raids
Judicial Remand Extended
Vijayawada Jail
AP Devadaya Department

More Telugu News