చెన్నైతో మ్యాచ్... చచ్చీచెడీ 159 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్
- చెన్నైతో పోరులో తడబడ్డ ముంబై ఇండియన్స్ బ్యాటర్లు
- అతి కష్టమ్మీద 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసిన హార్దిక్ సేన
- యువ బ్యాటర్ నమన్ ధీర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్న వైనం
- 3 వికెట్లతో ముంబైని దెబ్బతీసిన అన్షుల్ కంబోజ్
- స్లో బ్యాటింగ్ తో నిరాశపరిచిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తడబడ్డారు. చెపాక్ స్టేడియం వేదికగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. యువ ఆటగాడు నమన్ ధీర్ (57) అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేయగా, మిగతా బ్యాటర్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే ముంబైకి భారీ షాక్ తగిలింది. ఓపెనర్ విల్ జాక్స్ (1) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. అయితే, మరో ఓపెనర్ ర్యాన్ రికల్టన్ (24 బంతుల్లో 37; 5 సిక్సర్లు), నమన్ ధీర్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 58 పరుగులు జోడించడంతో ముంబై కోలుకున్నట్లు కనిపించింది. కానీ, రికల్టన్ ఔటైన తర్వాత మళ్లీ వికెట్ల పతనం మొదలైంది.
సూర్యకుమార్ యాదవ్ (21) వేగంగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. తిలక్ వర్మ (5) పూర్తిగా విఫలమయ్యాడు. ఈ దశలో ఒకవైపు వికెట్లు పడుతున్నా, నమన్ ధీర్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అయితే, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 18) ఆడిన స్లో ఇన్నింగ్స్ జట్టు స్కోరు వేగానికి తీవ్రంగా అడ్డుకట్ట వేసింది. చివరి ఓవర్లలోనూ ముంబై బ్యాటర్లు భారీ షాట్లు ఆడలేకపోయారు.
చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ముంబైని కట్టడి చేశారు. అన్షుల్ కంబోజ్ 3 వికెట్లతో సత్తా చాటగా, నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్ చెరో వికెట్ తీశారు. దీంతో ముంబై ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 160 పరుగుల లక్ష్యంతో చెన్నై బరిలోకి దిగనుంది.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే ముంబైకి భారీ షాక్ తగిలింది. ఓపెనర్ విల్ జాక్స్ (1) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. అయితే, మరో ఓపెనర్ ర్యాన్ రికల్టన్ (24 బంతుల్లో 37; 5 సిక్సర్లు), నమన్ ధీర్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 58 పరుగులు జోడించడంతో ముంబై కోలుకున్నట్లు కనిపించింది. కానీ, రికల్టన్ ఔటైన తర్వాత మళ్లీ వికెట్ల పతనం మొదలైంది.
సూర్యకుమార్ యాదవ్ (21) వేగంగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. తిలక్ వర్మ (5) పూర్తిగా విఫలమయ్యాడు. ఈ దశలో ఒకవైపు వికెట్లు పడుతున్నా, నమన్ ధీర్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అయితే, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 18) ఆడిన స్లో ఇన్నింగ్స్ జట్టు స్కోరు వేగానికి తీవ్రంగా అడ్డుకట్ట వేసింది. చివరి ఓవర్లలోనూ ముంబై బ్యాటర్లు భారీ షాట్లు ఆడలేకపోయారు.
చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ముంబైని కట్టడి చేశారు. అన్షుల్ కంబోజ్ 3 వికెట్లతో సత్తా చాటగా, నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్ చెరో వికెట్ తీశారు. దీంతో ముంబై ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 160 పరుగుల లక్ష్యంతో చెన్నై బరిలోకి దిగనుంది.