ఏపీ ప్రజలకు శుభవార్త... తిరిగి ప్రారంభమైన 'ఎన్టీఆర్ వైద్య సేవ'
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఊరట కలిగించే వార్త. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన 'ఎన్టీఆర్ వైద్య సేవ' పథకం తిరిగి ప్రారంభమైంది. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) తమ సమ్మెను విరమించుకుంది. దీంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో యథావిధిగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించడంతోనే సమ్మె విరమించినట్లు 'ఆషా' ప్రతినిధులు తెలిపారు. మొత్తం బకాయిల్లో భాగంగా రూ.1,000 కోట్లను 10 రోజుల్లో చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మిగిలిన రూ.1,000 కోట్ల బకాయిలను రెండో త్రైమాసికంలో చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. ఈ హామీతో నెట్వర్క్ ఆసుపత్రులు తమ సేవలను పునరుద్ధరించాయి.
గత కొంతకాలంగా ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో 'ఆషా' సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీనివల్ల 'ఎన్టీఆర్ ఆరోగ్య సేవ' పథకం కింద చికిత్స పొందే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ప్రభుత్వం, 'ఆషా' మధ్య ఒప్పందం కుదరడంతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఇచ్చిన హామీలను ప్రభుత్వం సకాలంలో నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు 'ఆషా' వర్గాలు పేర్కొన్నాయి.
ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించడంతోనే సమ్మె విరమించినట్లు 'ఆషా' ప్రతినిధులు తెలిపారు. మొత్తం బకాయిల్లో భాగంగా రూ.1,000 కోట్లను 10 రోజుల్లో చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మిగిలిన రూ.1,000 కోట్ల బకాయిలను రెండో త్రైమాసికంలో చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. ఈ హామీతో నెట్వర్క్ ఆసుపత్రులు తమ సేవలను పునరుద్ధరించాయి.
గత కొంతకాలంగా ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో 'ఆషా' సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీనివల్ల 'ఎన్టీఆర్ ఆరోగ్య సేవ' పథకం కింద చికిత్స పొందే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ప్రభుత్వం, 'ఆషా' మధ్య ఒప్పందం కుదరడంతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఇచ్చిన హామీలను ప్రభుత్వం సకాలంలో నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు 'ఆషా' వర్గాలు పేర్కొన్నాయి.