హిందూ పండుగలకు అనుమతులివ్వడం లేదు: బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Aleti Maheshwar Reddy Angered by Denial of Permissions for Hindu Festivals
  • కోర్టులకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన
  • తెలంగాణ వ్యాప్తంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణ
  • అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్న మహేశ్వర్ రెడ్డి
హిందూ పండుగలకు తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదని, కోర్టులకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని అన్నారు.

నిర్మల్ ఎస్పీ హిందువులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి దమ్ముంటే గంజాయి, డ్రగ్స్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. ఎస్పీపై చర్యల కోసం అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని తెలిపారు. హిందువులు ఇన్నాళ్లు శాంతియుతంగా ఉన్నారని, ఇక నుంచి సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని అన్నారు.
Advertisement
Aleti Maheshwar Reddy
Telangana
Hindu festivals
BJP
Revanth Reddy
Nirmal
Telangana Police

More Telugu News