తుర్కియే ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. బాస్పోరస్ జలసంధిలో ఉద్రిక్తత

తుర్కియేకి చెందిన భారీ చమురు ట్యాంకర్‌పై నల్ల సముద్రంలో డ్రోన్‌ దాడి జరగడం కలకలం రేపింది. ఇస్తాంబుల్ సమీపంలోని అత్యంత కీలకమైన బాస్పోరస్ జలసంధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 10 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో ప్రయాణిస్తున్న M/T ఆల్టురా అనే నౌకను ఓ గుర్తుతెలియని డ్రోన్ ఢీకొట్టింది.

డ్రోన్ ఢీకొన్న వెంటనే నౌకలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన తుర్కియే రక్షణ దళాలు వేగంగా స్పందించి మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో ఎలాంటి చమురు లీకేజీ జరగలేదని అధికారులు తెలిపారు. 

ప్రపంచ వాణిజ్యం, చమురు రవాణాలో బాస్పోరస్ జలసంధి అత్యంత వ్యూహాత్మకమైన మార్గం. ఇక్కడ దాడి జరగడం అంతర్జాతీయ నౌకాయాన వర్గాల్లో ఆందోళన నింపింది. ఈ దాడికి ఇప్పటివరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే, ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాంతీయంగా అస్థిరత సృష్టించేందుకు శత్రు దేశాలు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని తుర్కియే సందేహిస్తోంది.

ఈ ఘటన నేపథ్యంలో, భద్రతా కారణాల రీత్యా బాస్పోరస్ జలసంధిలో నౌకల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అధికారులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి, భద్రతను సమీక్షిస్తున్నారు.


More Telugu News