Sridhar Babu: తెలంగాణలో అమెరికా టెక్ దిగ్గజాలతో కలిసి పీపీపీని ప్రోత్సహిస్తున్నాం: శ్రీధర్ బాబు

Sridhar Babu Promoting PPP with US Tech Giants in Telangana
  • ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్న శ్రీధర్ బాబు
  • అమెరికా, ఇండియా వాణిజ్య మండలి ప్రతినిధులతో చర్చలు
  • పెట్టుబడిదారులకు ఐటీ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయన్న మంత్రి
అమెరికా టెక్ దిగ్గజాలతో కలిసి తెలంగాణలో పీపీపీని ప్రోత్సహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న 'ఏఐ ఇంపాక్ట్' సదస్సులో ఆయన పాల్గొన్నారు. అమెరికా, ఇండియా వాణిజ్య మండలి ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కృత్రిమ మేధ (ఏఐ) ఆవిష్కరణలకు తెలంగాణ వేదికగా ఉందని మంత్రి అన్నారు.

పెట్టుబడిదారులకు ఐటీ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వ స్థిరమైన విధానాల కారణంగా ఏఐ పరిశోధనలకు రాష్ట్రం వేదికగా మారింది. ప్రజాసేవల్లోనూ ఏఐ ద్వారా వేగంగా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
Sridhar Babu
Telangana
PPP
Artificial Intelligence
AI Innovation
US India Trade
IT Investment Telangana

More Telugu News