Satya Kumar: కిమ్స్ టెండర్ వివాదం... అసలు విషయం చెప్పిన మంత్రి సత్యకుమార్

Satya Kumar Clarifies KIMS Tender Controversy in Adoni Medical College Project
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో నిర్మించ తలపెట్టిన ఆదోని మెడికల్ కాలేజీ టెండర్ వ్యవహారంలో నెలకొన్న గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. ఆదోని కాలేజీకి కిమ్స్ (KIMS) ఆసుపత్రి బిడ్ వేసిందని తొలుత ప్రకటించిన ప్రభుత్వం, ఆ తర్వాత కిమ్స్ యాజమాన్యం దానిని ఖండించడంతో ఇరకాటంలో పడింది. ఈ వివాదంపై తాజాగా మంత్రి సత్యకుమార్ స్పష్టతనిచ్చారు.

కిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ప్రేమ్ చంద్ షా తన వ్యక్తిగత హోదాలో టెండర్ దాఖలు చేశారని, అయితే ఆయన కిమ్స్‌లో పనిచేస్తుండటంతో సంస్థే బిడ్ వేసిందని పొరపాటు పడ్డామని మంత్రి వివరించారు. "ఇది కేవలం ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే. కిమ్స్ సంస్థ ఎలాంటి బిడ్ వేయలేదు" అని ఆయన స్పష్టం చేశారు.

అంతకుముందు, ప్రభుత్వం నాలుగు మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలవగా, ఒక్క ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ నుంచి బిడ్ వచ్చిందని ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను కిమ్స్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. తాము టెండర్లలో పాల్గొనలేదని, వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని తేల్చిచెప్పింది. కిమ్స్ ప్రకటనతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వం పిలిచిన టెండర్లలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీలకు ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. ఇప్పుడు ఆదోనికి వచ్చింది కూడా సంస్థాగత బిడ్ కాదని తేలింది.
Go Back to Shorts
Satya Kumar
Andhra Pradesh
Adoni Medical College
KIMS Hospital
PPP
Public Private Partnership
Tender Controversy
Medical College Tenders
Prem Chand Sha
AP Medical Colleges

More Telugu News