భారత్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్... స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ
- ఢిల్లీ సమీపంలోని పాలం ఎయిర్ స్టేషన్లో దిగిన పుతిన్
- పుతిన్, మోదీ ఆత్మీయ ఆలింగనం
- 23వ వార్షిక శిఖరాగ్ర భేటీ భాగంగా సమావేశం కానున్న మోదీ, పుతిన్
విమానాశ్రయంలో కళాకారుల నృత్యాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పుతిన్ గౌరవార్థం రాత్రి ప్రధానమంత్రి విందు ఇవ్వనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం పలకనున్నారు. అలాగే, 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అణువిద్యుత్తో సహా పలు రంగాల్లో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరుగనున్నాయి.