పాకిస్థాన్ టీ20 జట్టులోకి బాబర్ ఆజం రీఎంట్రీ... రిజ్వాన్పై వేటు!
- ఏడాది తర్వాత పాకిస్థాన్ టీ20 జట్టులోకి బాబర్ ఆజం పునరాగమనం
- గతేడాది పేలవమైన స్ట్రైక్ రేట్ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన బాబర్
- వికెట్ కీపర్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, హరీస్ రౌవూఫ్లపై వేటు
- టీ20 జట్టుకు కొత్త కెప్టెన్గా సల్మాన్ అఘా నియామకం
- ఆసియా కప్లో భారత్ చేతిలో ఓటమి తర్వాత జట్టులో భారీ మార్పులు
- వన్డే జట్టు కెప్టెన్గా షాహీన్ అఫ్రిది.. జట్టులో రిజ్వాన్కు చోటు
ఇటీవల ముగిసిన ఆసియా కప్లో పాకిస్థాన్ రన్నరప్గా నిలిచినప్పటికీ, చిరకాల ప్రత్యర్థి భారత్తో ఆడిన మూడు మ్యాచ్లలోనూ ఓటమి చవిచూసింది. ఈ ప్రదర్శన నేపథ్యంలో జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్కు టీ20 జట్టులో చోటు దక్కలేదు. అతనితో పాటు ఓపెనర్ ఫఖర్ జమాన్, మహమ్మద్ హరీస్, ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌవూఫ్లను కూడా పక్కనపెట్టారు.
ఈ సిరీస్కు జట్టుకు ఆల్రౌండర్ సల్మాన్ అఘా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. పేసర్ నసీమ్ షా, బ్యాటర్ అబ్దుల్ సమద్, వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్లకు తొలిసారిగా జట్టులో చోటు కల్పించారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ అక్టోబర్ 28న రావల్పిండిలో ప్రారంభం కానుంది.
టీ20 సిరీస్ అనంతరం పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 4 నుంచి 8 వరకు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా జరగనుంది. ఈ వన్డే సిరీస్కు షాహీన్ షా అఫ్రిది కెప్టెన్గా వ్యవహరిస్తాడు. టీ20 జట్టులో స్థానం కోల్పోయిన మహమ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్లు వన్డే జట్టులో కొనసాగుతుండటం గమనార్హం.