టిక్కెట్ ధరల విషయంలో 'ఓజీ' కి హైకోర్టులో స్వల్ప ఊరట

  • 'ఓజీ' టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి
  • టిక్కెట్ ధరల పెంపుపై స్టే విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్
  • సింగిల్ బెంచ్ తీర్పుపై రేపటి వరకు స్టే విధించిన డివిజన్ బెంచ్
తెలంగాణ రాష్ట్రంలో టిక్కెట్ ధరల విషయంలో 'ఓజీ' చిత్ర యూనిట్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 'ఓజీ' టిక్కెట్ ధరలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ రేపటి వరకు స్టే విధించింది. 'ఓజీ' టిక్కెట్ రేట్ల పెంపు జీవోను సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ నిన్న తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది.

'ఓజీ' సినిమా విడుదల నేపథ్యంలో సినీ నిర్మాతల విజ్ఞప్తి మేరకు టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ టిక్కెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు నిన్న స్టే విధించింది. బెనిఫిట్ షో టిక్కెట్ ధరలను పెంచవద్దని హైకోర్టు పేర్కొంది.


More Telugu News