ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. రూ.1,299కే విమాన ప్రయాణం!

  • ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 'పేడే సేల్' ప్రకటన
  •  అంతర్జాతీయ ప్రయాణాలకు ₹4,876 నుంచే టికెట్లు
  • సెప్టెంబర్ 1 వరకు బుకింగ్స్, వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రయాణం
  • సభ్యులకు ప్రత్యేక డిస్కౌంట్లు, అదనపు ప్రయోజనాలు
  • విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రాయితీలు
విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శుభవార్త చెప్పింది. 'పేడే సేల్' పేరుతో పరిమిత కాల ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో విమాన టికెట్లను అత్యంత తక్కువ ధరలకే అందిస్తోంది. ఈ ఆఫర్ కింద దేశీయ ప్రయాణాలకు టికెట్ ధర కేవలం రూ. 1,299 నుంచే ప్రారంభం కావడం విశేషం.

ఈ సేల్‌లో భాగంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయిన సభ్యులు దేశీయ రూట్లలో ఎక్స్‌ప్రెస్ లైట్ టికెట్లను రూ. 1,299 నుంచి, ఎక్స్‌ప్రెస్ వ్యాల్యూ టికెట్లను రూ. 1,349 నుంచి బుక్ చేసుకోవచ్చు. ఇక అంతర్జాతీయ ప్రయాణాలకు ఎక్స్‌ప్రెస్ లైట్ ధరలు రూ.4,876 నుంచి, ఎక్స్‌ప్రెస్ వ్యాల్యూ ధరలు రూ.5,403 నుంచి ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. ప్రయాణికులు నేడు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లపై 2026, మార్చి 31 వరకు ప్రయాణించే వెసులుబాటు కల్పించారు.

సంస్థ వెబ్‌సైట్ మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే వారికి ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. మొబైల్ యాప్‌లో ఎక్స్‌ప్రెస్ లైట్ టికెట్లు బుక్ చేసుకుంటే కన్వీనియన్స్ ఫీజును పూర్తిగా మినహాయించారు. అలాగే, ఈ కేటగిరీలో దేశీయ ప్రయాణాలకు 15 కిలోల చెక్-ఇన్ బ్యాగేజ్‌కు రూ.1,000, అంతర్జాతీయ ప్రయాణాలకు 20 కిలోల బ్యాగేజ్‌కు రూ.1,300 చొప్పున రాయితీ ధరలకు లభిస్తుంది.

ప్రీమియం సేవలు కోరుకునే వారి కోసం ఎక్స్‌ప్రెస్ బిజ్ కేటగిరీలో కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. సభ్యులు వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకుంటే ఎక్స్‌ప్రెస్ బిజ్ టికెట్లపై 25 శాతం వరకు, బిజ్ అప్‌గ్రేడ్‌లపై 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ బిజ్ క్లాస్‌లో విశాలమైన సీట్లు, కాంప్లిమెంటరీ భోజనం, అధిక బ్యాగేజ్ అలవెన్స్ (దేశీయం 25 కిలోలు, అంతర్జాతీయం 40 కిలోలు) వంటి సౌకర్యాలు ఉంటాయి.

వీటితో పాటు లాగిన్ అయిన సభ్యులకు హాట్ మీల్స్, సీట్ సెలక్షన్, ప్రయారిటీ సర్వీసులపై 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా 10 కిలోల చెక్-ఇన్ బ్యాగేజ్, 3 కిలోల క్యాబిన్ బ్యాగేజ్‌తో పాటు ప్రతి బుకింగ్‌పై 8 శాతం వరకు న్యూకాయిన్స్ కూడా సంపాదించుకోవచ్చు. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, సాయుధ దళాల సిబ్బందికి కూడా ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. చెల్లింపులను సులభతరం చేసేందుకు ఈఎంఐ, 'బై నౌ, పే లేటర్' వంటి ఆప్షన్లను కూడా అందుబాటులో ఉంచింది.


More Telugu News