Baba Vanga: మూడో ప్రపంచ యుద్ధం.. ప్రకృతి విలయం.. వచ్చే ఏడాదిపై బాబా వంగా షాకింగ్ భవిష్యవాణి!
- 7-8 శాతం భూభాగంపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం
- మానవాళిపై పెరగనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్యం
- నవంబర్లో భూమిపైకి రానున్న గ్రహాంతరవాసులు
- ప్రస్తుత ప్రపంచ పరిణామాలతో భవిష్యవాణిపై తీవ్ర చర్చ
బల్గేరియాకు చెందిన ప్రముఖ అంధ ప్రవక్త బాబా వంగా చెప్పిన జోస్యాలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. "బాల్కన్ల నాస్ట్రడామస్"గా పేరుపొందిన ఆమె దశాబ్దాల క్రితమే కన్నుమూసినా.. ఆమె చెప్పిన భవిష్యవాణి నేటికీ అనేక సందర్భాల్లో నిజమవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో, 2026 సంవత్సరం గురించి ఆమె చెప్పినట్టుగా ప్రచారంలో ఉన్న కొన్ని విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రకృతి విలయం నుంచి ప్రపంచ యుద్ధం వరకు ఆమె హెచ్చరికలు మానవాళికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
వచ్చే ఏడాది ప్రపంచం తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోనుందని బాబా వంగా జోస్యం చెప్పినట్టు తెలుస్తోంది. భూమిపై దాదాపు 7-8 శాతం భూభాగం భారీ భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణ మార్పులతో అల్లకల్లోలంగా మారుతుందని ఆమె హెచ్చరించింది. ఇప్పటికే 2025లో ఐరోపాలో రికార్డు స్థాయి వేడి, కెనడా, ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు, పసిఫిక్ ప్రాంతంలో భూకంపాల తీవ్రత పెరగడం వంటి పరిణామాలు ఈ హెచ్చరికలకు బలం చేకూరుస్తున్నాయి.
మూడో ప్రపంచ యుద్ధం ముప్పు
అన్నింటికన్నా అత్యంత ఆందోళన కలిగించే విషయం మూడో ప్రపంచ యుద్ధం గురించిన ఆమె భవిష్యవాణి. తైవాన్పై చైనా దాడికి దిగే అవకాశం ఉందని, అలాగే రష్యా, అమెరికా మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణ తలెత్తవచ్చని ఆమె అంచనా వేసినట్టు చెబుతున్నారు. మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా, దక్షిణాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు చూస్తుంటే, ప్రాంతీయ వివాదాలు పెద్ద యుద్ధానికి దారితీయవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏఐ ఆధిపత్యం.. ఏలియన్స్ రాక
సాంకేతిక రంగంలోనూ 2026 కీలక మలుపు కానుందని బాబా వంగా చెప్పినట్టు ప్రచారంలో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవులకు సహాయకారిగా ఉండటమే కాకుండా, కీలక రంగాలపై పూర్తి ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తుందని ఆమె హెచ్చరించారు. ఇది భారీగా ఉద్యోగ నష్టాలకు, నైతిక సవాళ్లకు దారితీయవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
మరోవైపు, 2026 నవంబర్లో గ్రహాంతరవాసులతో మానవాళికి తొలిసారి పరిచయం ఏర్పడుతుందని, ఓ భారీ అంతరిక్ష నౌక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని ఆమె జోస్యం చెప్పడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియదు కానీ, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో బాబా వంగా జోస్యంపై సర్వత్రా తీవ్ర చర్చ జరుగుతోంది.
వచ్చే ఏడాది ప్రపంచం తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోనుందని బాబా వంగా జోస్యం చెప్పినట్టు తెలుస్తోంది. భూమిపై దాదాపు 7-8 శాతం భూభాగం భారీ భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణ మార్పులతో అల్లకల్లోలంగా మారుతుందని ఆమె హెచ్చరించింది. ఇప్పటికే 2025లో ఐరోపాలో రికార్డు స్థాయి వేడి, కెనడా, ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు, పసిఫిక్ ప్రాంతంలో భూకంపాల తీవ్రత పెరగడం వంటి పరిణామాలు ఈ హెచ్చరికలకు బలం చేకూరుస్తున్నాయి.
మూడో ప్రపంచ యుద్ధం ముప్పు
అన్నింటికన్నా అత్యంత ఆందోళన కలిగించే విషయం మూడో ప్రపంచ యుద్ధం గురించిన ఆమె భవిష్యవాణి. తైవాన్పై చైనా దాడికి దిగే అవకాశం ఉందని, అలాగే రష్యా, అమెరికా మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణ తలెత్తవచ్చని ఆమె అంచనా వేసినట్టు చెబుతున్నారు. మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా, దక్షిణాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు చూస్తుంటే, ప్రాంతీయ వివాదాలు పెద్ద యుద్ధానికి దారితీయవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏఐ ఆధిపత్యం.. ఏలియన్స్ రాక
సాంకేతిక రంగంలోనూ 2026 కీలక మలుపు కానుందని బాబా వంగా చెప్పినట్టు ప్రచారంలో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవులకు సహాయకారిగా ఉండటమే కాకుండా, కీలక రంగాలపై పూర్తి ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తుందని ఆమె హెచ్చరించారు. ఇది భారీగా ఉద్యోగ నష్టాలకు, నైతిక సవాళ్లకు దారితీయవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
మరోవైపు, 2026 నవంబర్లో గ్రహాంతరవాసులతో మానవాళికి తొలిసారి పరిచయం ఏర్పడుతుందని, ఓ భారీ అంతరిక్ష నౌక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని ఆమె జోస్యం చెప్పడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియదు కానీ, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో బాబా వంగా జోస్యంపై సర్వత్రా తీవ్ర చర్చ జరుగుతోంది.