ఇండియన్ ఆర్మీపై అలియా భట్ భావోద్వేగపూరిత పోస్ట్
- భారత్, పాక్ ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి పోస్ట్
- ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి ఉంటుందన్న అలియా
- అలియా ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి అలియా భట్ భారత ఆర్మీని ఉద్దేశించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి ఉంటుందని అలియా పెట్టిన ఈ భావోద్వేగపూరిత పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒకవిధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది, ప్రతి వార్తా వెనుక, ప్రతి భోజన బల్ల చుట్టూ ఆ నిశ్శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎక్కడో పర్వతాలలో మన సైన్యం మేల్కొని, దేశకోసం మనకోసం యుద్ధం చేస్తున్నారు అనే బరువును మనం అనుభవించాం.
మనలో చాలామంది మన ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డర్లో ఉన్న ప్రజలు, సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, త్యాగం. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని, అనిశ్చితితో, ఉద్రిక్తతతో కూడిన రాత్రి అని తన తల్లికి తెలుస్తుంది" అంటూ అలియా తన ఇన్స్టా స్టోరీలో ఎమోషనల్గా రాసుకొచ్చారు.
"గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒకవిధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది, ప్రతి వార్తా వెనుక, ప్రతి భోజన బల్ల చుట్టూ ఆ నిశ్శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎక్కడో పర్వతాలలో మన సైన్యం మేల్కొని, దేశకోసం మనకోసం యుద్ధం చేస్తున్నారు అనే బరువును మనం అనుభవించాం.
మనలో చాలామంది మన ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డర్లో ఉన్న ప్రజలు, సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, త్యాగం. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని, అనిశ్చితితో, ఉద్రిక్తతతో కూడిన రాత్రి అని తన తల్లికి తెలుస్తుంది" అంటూ అలియా తన ఇన్స్టా స్టోరీలో ఎమోషనల్గా రాసుకొచ్చారు.
More Telugu News
నియోజకవర్గాల పునర్విభజన.. దక్షిణాదికి అన్యాయం జరిగితే తీవ్ర పోరాటం తప్పదని కేటీఆర్ హెచ్చరిక
![]()
తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించిన నారా లోకేశ్
![]()
భారత్లో తొలిసారి.. ముంబైలో పట్టాలెక్కనున్న నాన్-ఏసీ క్లోజ్డ్ డోర్ లోకల్ రైలు
![]()
హెల్త్కేర్ కంపెనీలకు క్యూ4లో మిశ్రమ ఫలితాలు.. ఆదాయం పెరిగినా లాభాల డౌన్!
![]()
10 వేలమందితో హర్మూజ్, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం: అమెరికా వెల్లడి
![]()
'అనకొండ' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
![]()
ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల.. 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత!
![]()
హర్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా దిగ్బంధనాన్ని ఛేదించిన ఇరాన్ నౌకలు!
![]()
అండమాన్ సముద్రంలో పడవ మునిగి 250 మంది గల్లంతు
![]()
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ పూర్తి మద్దతు.. డీలిమిటేషన్పై వార్నింగ్
![]()
రూ. 3000 కోట్ల క్లబ్లో 'ధురంధర్' ఫ్రాంచైజీ.. బాహుబలి, పుష్పలను వెనక్కి నెట్టి చారిత్రక రికార్డ్!
![]()
15 ఏళ్లుగా అక్షయ్ కుమార్ సమోసాలకు ఎందుకు దూరంగా వుంటున్నారు?
![]()
జువ్వలదిన్నెకు చేరుకున్న జగన్
![]()
హెరిటేజ్ 'లడ్డూ ప్రసాదం' ఐస్క్రీమ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు.. టీడీపీ కౌంటర్.. అసలేంటీ వివాదం?
![]()
అమెరికా-ఇరాన్ టెన్షన్ కూల్.. మార్కెట్లలో భారీ జోష్
![]()