Masood Azhar: ఆపరేషన్ సిందూర్... జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి, బావ సహా 10 మంది కుటుంబ సభ్యుల మృతి

Operation Sindhu 10 of Masood Azhars Family Members Killed

  • పాక్, పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు
  • ఆపరేషన్ సింధూర్ పేరిట తెల్లవారుజామున చర్యలు
  • కుటుంబ సభ్యులు చనిపోయినట్టు మసూద్ అజార్ స్వయంగా చెప్పినట్లు బీబీసీ ఉర్దూ కథనం

పాకిస్థాన్ భూభాగం మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత భద్రతా దళాలు ఈ తెల్లవారుజామున దాడులు చేపట్టాయి. 'ఆపరేషన్ సిందూర్' పేరుతో చేపట్టిన ఈ చర్యల్లో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మరణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

తెల్లవారుజామున 1.05 గంటల సమయంలో, పాకిస్థాన్ మరియు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలను ఈ దాడుల్లో లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా, పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో భారత సైన్యం జరిపిన దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చెందిన 10 మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మసూద్ సోదరి, బావ, మేనల్లుడు సహా 10 మరణించారు.

ఈ దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులతో పాటు నలుగురు సహాయకులు కూడా మరణించారని మసూద్ అజార్ స్వయంగా పేర్కొన్నట్లు బీబీసీ ఉర్దూ కథనాలు ప్రచురించాయి. ఈ వార్త ఉగ్రవాద వర్గాల్లో తీవ్ర కలకలం రేపినట్లు సమాచారం.

Masood Azhar
Jaish-e-Mohammed
Operation Sindhu
Pakistan
POK
Terrorist attack
Family members killed
India
Surgical strike
Bahawalpur
  • Loading...

More Telugu News