Ramcharan: ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది: రామ్‌చ‌ర‌ణ్

Ram Charan Shocked by Pahalgham Terrorist Attack

  


క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో జ‌రిగిన‌ ఉగ్ర‌దాడిపై గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ స్పందించారు. ఈ ఉగ్ర ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌న్నారు. ఇది చాలా బాధ‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌గా పేర్కొన్నారు. ఈ మేర‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా చెర్రీ పోస్ట్ పెట్టారు. 

"ప‌హ‌ల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలా బాధించింది. ఇటువంటి సంఘటనలకు మన సమాజంలో చోటు లేదు. ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలి. ఈ కష్ట సమయాన్ని తట్టుకుని నిలబడే మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని దేవుడు బాధిత కుటుంబాలకు ఇవ్వాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను" అని చ‌ర‌ణ్ పేర్కొన్నారు. 

Ramcharan
Pahalgham Terrorist Attack
Kashmir Attack
Ram Charan Condemns Attack
Terrorism in Kashmir
Celebrity Reaction
India Terrorism
Global Star Ram Charan
  • Loading...

More Telugu News