గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం అమలుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
- కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వానికి గేట్స్ ఫౌండేషన్ సహకారం
- ఇటీవల బిల్ గేట్స్ తో సమావేశమై చర్చించిన సీఎం చంద్రబాబు
- నేడు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ
సుపరిపాలన, వ్యవసాయంలో ఏఐ టెక్నాలజీ వినియోగం, వైద్య ఆరోగ్య రంగం, జీవన ప్రమాణాల పెంపుపై ఏపీ ప్రభుత్వం-గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమై అనేక అంశాలపై లోతుగా చర్చించారు.