154 మంది భార‌తీయుల‌కు పాకిస్థాన్ వీసాల జారీ.. కార‌ణ‌మిదే!

Pakistan Issues 154 Visas To Indian Pilgrims To Visit Katas Raj Temples
  • శ్రీ క‌టాస్ రాజ్ ఆల‌యాల‌ సంద‌ర్శన కోసం భార‌తీయుల‌కు పాక్ వీసాలు
  • ఈ నెల 24 నుంచి వ‌చ్చే నెల 2 వ‌ర‌కు వారు ప‌ర్య‌టిస్తార‌ని పాక్ హైక‌మిష‌న్ వెల్ల‌డి
  • ఇరు దేశాల ప‌ర‌స్ప‌ర గౌర‌వం, మ‌త‌ సామ‌రస్యం కోసం ఇలా వీసాలు జారీ చేస్తూనే ఉంటామ‌ని వ్యాఖ్య
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న శ్రీ క‌టాస్ రాజ్ ఆల‌యాల‌ను సంద‌ర్శించేందుకు వ‌స్తున్న 154 మంది భార‌తీయుల‌కు వీసాలు జారీ చేశామ‌ని న్యూఢిల్లీలోని ఆ దేశ హైక‌మిష‌న్ శుక్ర‌వారం తెలిపింది. ఈ నెల 24 నుంచి వ‌చ్చే నెల 2 వరకు వారు అక్కడ ప‌ర్య‌టిస్తార‌ని వెల్ల‌డించింది. 

"ఇరు దేశాల ప‌ర‌స్ప‌ర గౌర‌వం, మ‌త‌ సామ‌రస్యం కోసం ఇలా వీసాలు జారీ చేస్తూనే ఉంటాం" అని హైక‌మిష‌న్ పేర్కొంది. ఈ సంద‌ర్భంగా యాత్రికులకు ఆధ్యాత్మికంగా ఫలదాయకమైన, సంతృప్తికరమైన ప్రయాణం జరగాలని భారతదేశంలో పాకిస్థాన్ వ్యవహారాల అధికారి సాద్ అహ్మద్ వారాయిచ్ ఆకాంక్షించారు.

కాగా, 1974 నాటి పాక్‌-భారత్ మతపరమైన పుణ్యక్షేత్రాల సందర్శన ప్రోటోకాల్ ప్రకారం ప్ర‌తీ ఏటా వేలాదిమంది భారతీయ యాత్రికులు వివిధ మతపరమైన ఉత్సవాలకు హాజరు కావడానికి పాకిస్థాన్‌కు వెళుతుంటారు.
Go Back to Shorts
Indian Pilgrims
Pakistan
Visa
Katas Raj Temples

More Telugu News