చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: వైసీపీ
- నిన్న విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి
- ఈసీ చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు
- ఇవాళ గాజువాకలో చంద్రబాబుపై రాయి విసిరిన ఆగంతుకుడు
- ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలన్న వైసీపీ
"చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలని, ఘటనకు కారకులను శిక్షించాలని కోరుతున్నాం" అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఈ మేరకు చంద్రబాబు వీడియోను కూడా వైసీపీ పంచుకుంది.