నేను ఎక్కడ ఉన్నా ఓ కన్ను కొడంగల్ పైనే ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి
- తన ఇంటి వద్ద కార్యకర్తలు, అభిమానులతో సమావేశం
- కొడంగల్కు పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్న ముఖ్యమంత్రి
- తాను కష్టాల్లో ఉన్నప్పుడు కొడంగల్ అండగా నిలిచిందని వ్యాఖ్య
కార్యకర్తలను కలవాలని వచ్చానని చెప్పారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు కొడంగల్ ప్రజలు తన వెంటే ఉన్నారని పేర్కొన్నారు. తాను ప్రచారానికి రాకపోయినప్పటికీ గెలిపించారన్నారు. ఇక్కడకు సిమెంట్ పరిశ్రమ రాబోతుందని... పరిశ్రమలు వస్తే మన భూముల ధరలు కూడా పెరుగుతాయన్నారు. ఏప్రిల్ 6న జరిగే తుక్కుగూడ కాంగ్రెస్ బహిరంగ సభకు కొడంగల్ నుంచి 25వేల మంది తరలి రావాలన్నారు. ఈ సభలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని, దేశవ్యాప్తంగా ఐదు గ్యారెంటీలు ప్రకటిస్తారన్నారు.