బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ నేత
- ఫిలిబిత్ నుంచి వరుణ్ గాంధీకి టిక్కెట్ నిరాకరించిన బీజేపీ
- ఆయన మూలాలు గాంధీ కుటుంబంతో ముడిపడి ఉండటం వల్లే బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదన్న కాంగ్రెస్ నేత
- కాంగ్రెస్లోకి వస్తే ఆనందిస్తామన్న అధిర్ రంజన్ చౌదరి
'వరుణ్ గాంధీ కాంగ్రెస్లోకి రావాలి. అప్పుడు మేం ఎంతో ఆనందిస్తాం. అతను చదువుకున్న వ్యక్తి. అలాగే క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి బీజేపీ టిక్కెట్ నిరాకరించింది. అందుకే అతను రావాలని (కాంగ్రెస్) నేను భావిస్తున్నాను' అని అధిర్ రంజన్ అన్నారు. ఫిలిబిత్ నుంచి వరుణ్ గాంధీ 2009, 2019లో విజయం సాధించారు. ఆయన రెండుసార్లు బీజేపీ నుంచే గెలిచారు. 1989లో మేనకా గాంధీ జనతాదళ్ నుంచి గెలిచారు. 1991లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఆ తర్వాత 2004లో, 2014లో మేనకా గాంధీ ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు.