ఈ నెల 17 లేదా 18న టీడీపీ-జనసేన-బీజేపీ భారీ సభ... హాజరుకానున్న ప్రధాని మోదీ!
- టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఖరారు
- ఢిల్లీ నుంచి టీడీపీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు
- భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచన
- మోదీ హాజరయ్యే ఈ సభకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని నిర్దేశం
పొత్తు కుదిరిన నేపథ్యంలో, ఈ నెల 17 లేదా 18న భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు నిర్దేశించారు. మూడు పార్టీలు కలిసి నిర్వహించే ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వస్తారని వివరించారు. ప్రధాని మోదీ పాల్గొనే ఈ సభకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని టీడీపీ నేతలకు సూచించారు.