Nagarjuna: కేసీఆర్‌ను పరామర్శించిన సినీ నటుడు నాగార్జున

  • కేసీఆర్‌కు యశోద ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స
  • ఆపరేషన్‌ అనంతరం కోలుకుంటున్న బీఆర్ఎస్ అధినేతకు నటుడు నాగార్జున పరామర్శ
  • కేసీఆర్‌ను కలవడంపై హర్షం వ్యక్తం చేసిన నాగార్జున
Nagarjuna Meets CM KCR in Yashodha Hospital

తుంటి మార్పిడి చికిత్స అనంతరం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రిలో కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కేసీఆర్‌ను పరామర్శించారు. తాజాగా సినీ నటుడు నాగార్జున కూడా యశోద ఆసుపత్రిలో కేసీఆర్‌‌ను కలుసుకున్నారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ను కలుసుకోవడంపై నాగార్జున స్పందిస్తూ, త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని తెలిపారు.

  • Loading...

More Telugu News