లోకేశ్, పవన్, పురందేశ్వరిలపై అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు
- జగన్ వల్ల పేద విద్యార్థులు కార్పొరేట్ విద్యను చదువుతున్నారన్న అంబటి
- కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను అందించారని కితాబు
- జగన్ ను ప్రజలు మళ్లీ సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
నారా లోకేశ్ పాదయాత్ర ఒక పెద్ద కామెడీ షో అని అంబటి ఎద్దేవా చేశారు. లోకేశ్ కు రాష్ట్రం గురించి అవగాహన లేని పవన్ కల్యాణ్ వత్తాసు పలుకుతున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ముసుగులో పురందేశ్వరి టీడీపీ కోవర్టుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ప్రజలు పూర్తి స్పష్టతతో ఉన్నారని... మళ్లీ జగన్ ను ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.