'తెలుగు తమ్ముళ్లూ, జర భద్రం' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్
- ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టే 2019లో మిమ్మల్ని 23కు దించేశారని వ్యాఖ్య
- పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పాతాళానికి తొక్కేశారని ఎద్దేవా
- 2024 నాటికి మరింత అప్రమత్తతతో పూర్తిగా బంగాళాఖాతంలో కలిపేస్తారన్న ఎంపీ
ఉదయం కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. అధికారంలోకి వస్తే వారి అంతుచూస్తా, వీరికి తోక కత్తిరిస్తా, వారి సాయంతో వీరిని కంట్రోల్ చేస్తా, ప్రకృతిని నియంత్రిస్తా, అది చేయనివ్వను.. ఇది చేయనివ్వనంటూ టీడీపీ, విపక్ష నేతలు రోడ్లపై, ఇళ్ల పైకప్పులెక్కి అరుస్తున్నారని, ఇందుకోసమా ప్రజలు మీకు ఓట్లెయ్యలి? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.