‘చంద్రయాన్’ ప్రస్తావనతో నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్
- చంద్రబాబు చేపట్టిన ‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ విజయవంతమైందన్న నారా లోకేశ్
- 10 రోజుల్లో 3000 కిలోమీటర్ల పర్యటన సాగిందని వెల్లడి
- నీటి కోసం, రైతుల బాగుకోసం ప్రభుత్వంపై టీడీపీ అధినేత నిప్పులు చెరిగారని వ్యాఖ్య
- బాబు రావాలి..రాష్ట్రం గెలవాలి అంటూ నినదించిన లోకేశ్
‘‘చంద్రయాన్! సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి గ్రాండ్ సక్సెస్..10 రోజులు...15 ప్రాజెక్టులు...20 జిల్లాలు...30 నియోజకవర్గాలు...35 ప్రజెంటేషన్లు, రోడ్ షోలు, బహిరంగ సభలు..3000 కిలోమీటర్లు...బెదిరింపులకు భయపడలేదు...రాళ్ళదాడులను లెక్కచేయలేదు...జలం కోసం...జనం కోసం...సాగునీటి కోసం...రైతు బాగుకోసం...నీళ్ల కోసం ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రుడు. నాయుడే ప్రజా నాయకుడు! బాబు రావాలి.....రాష్ట్రం గెలవాలి’’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.