గౌతమ్ సినిమాల్లోకి వస్తాడు: నమ్రత
- చదువు పూర్తయ్యాక తెరంగేట్రం చేస్తాడని చెప్పిన మహేశ్ భార్య
- '1 నేనొక్కడే' చిత్రంలో నటించిన గౌతమ్
- వాణిజ్య ప్రకటనలో సొంతంగా నటించిన సితార
ఈ విషయంపై మహేశ్ భార్య నమ్రత స్పందించారు. ప్రస్తుతం గౌతమ్ దృష్టి చదువుపైనే ఉందన్నారు. ఇంకో ఆరేడు సంవత్సరాల తర్వాతే సినిమాల్లోకి వస్తాడని చెప్పారు. మరోవైపు మహేశ్ గారాలపట్టి సితార కూడా నటనపై ఆసక్తి పెంచుకుంది. తనకు సినిమాలంటే ఇష్టమని చెప్పింది. ఆమె ఇప్పటికే వాణిజ్య ప్రకటనలో నటించింది. దానికి గాను వచ్చిన మొత్తం పాతితోషికాన్ని ఛారిటీ కోసం ఖర్చు చేసినట్టు తెలిపింది.