కర్ణాటక ఎన్నికల్లో కమల హాసన్ మద్దతు ఆ పార్టీకే!
- కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్న ‘మక్కల్ నీదిమయ్యం’ పార్టీ అధినేత
- రాహుల్ గాంధీ సూచన మేరకు కీలక నిర్ణయం తీసుకున్న సీనియర్ హీరో
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో మక్కల్ నీదిమయ్యం పార్టీ పొత్తుకు అవకాశం
ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కమల హాసన్ ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే యేడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మక్కల్ నీదిమయ్యం కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవటం ఖాయమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడున్నారు. లోక్సభ ఎన్నికల విషయమై కమల హాసన్ మూడు రోజుల కిందట కోయంబత్తూరు, సేలం జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఖరారైతే కమల హాసన్ కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉంది.