దేశంలోనే తొలిసారిగా ‘ఓట్ ఫ్రం హోమ్’ మొదలు.. ఎక్కడంటే!
- కర్ణాటక ఎన్నికల్లో సరికొత్త విధానం
- పోలింగ్ బూత్ కు రాలేని వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు అవకాశం
- వాళ్ల ఇంటి వద్దకే బ్యాలెట్ తీసుకెళ్లి ఓటు నమోదు చేసుకుంటున్న అధికారులు
ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకున్న వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే ఇలాంటి అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి నుంచి వారికి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 90 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈ పోలింగ్ ప్రక్రియ మే 6 వరకు జరగనుందని తెలిపింది. ఇలా ఇంటి నుంచి ఓటు వినియోగించుకునే వృద్ధులు 80,250 మందిని, దివ్యాంగ ఓటర్లు 19,279 మందిని గుర్తించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.