లోకేశ్ ను అంకుల్ అంటూ విమర్శలు గుప్పించిన రోజా
- ఏం చేయబోతున్నారో చెప్పకుండానే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారన్న రోజా
- తండ్రిని మళ్లీ సీఎం పీఠం ఎక్కించాలని తహతహలాడుతున్నారని మండిపాటు
- నాయకుడిగా లోకేశ్ ఫెయిల్యూర్ అని విమర్శ
తండ్రీకొడుకులు అవసరమైనప్పుడల్లా నందమూరి కుటుంబాన్ని వాడుకుంటున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని విస్మరిస్తున్నారని రోజా విమర్శించారు. సెక్యూరిటీ, వాలంటీర్లు లేకపోతే లోకేశ్ పాదయాత్రలో 10 మంది కూడా ఉండరని అన్నారు. నాయకుడిగా లోకేశ్ ఫెయిల్యూర్ అని చెప్పారు. ఇది గుర్తించే మంగళగిరి ప్రజలు లోకేశ్ ను ఓడించారని అన్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా గెలవలేని రికార్డు లోకేశ్ దే నని ఎద్దేవా చేశారు.