హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంట్లోకి దూసుకెళ్లిన కారు, ఒకరి మృతి
- కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామ సమీపంలో ఘటన
- ముగ్గురికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్కు చెందిన కళ్లెం శ్రీనివాస్గా గుర్తించారు. ఉప్పల్ గ్రామంలో తన స్నేహితుడిని దింపి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో ఉప్పల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.