సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేయొద్దు: మోదీ
- బీజేపీ నేతలకు సూచించిన ప్రధాని
- పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సూచన
- పఠాన్ సినిమాపై నిషేధం నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణే నటించిన పఠాన్ సినిమాపై వివాదం రేగడం తెలిసిందే! ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలని పలువురు నాయకులు, ఇతర సంఘాలు పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో హీరోయిన్ కాషాయ రంగు దుస్తులు ధరించడంపై బీజేపీ నేతలు పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా వంటి నేతలు చేసిన వ్యాఖ్యలను మీడియా హైలైట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తాజాగా పార్టీ నేతలకు సూచనలు చేసినట్లు సమాచారం.