ఎట్టకేలకు రంజీల్లోకి సచిన్ తనయుడు... ముంబయి తరఫున కాదు!
- రంజీల్లో ఆడేందుకు చాలాకాలం నుంచి వేచిచూస్తున్న అర్జున్
- ముంబయి జట్టులో స్థానం దక్కని వైనం
- గోవాకు తరలివెళ్లిన సచిన్ కుమారుడు
- నేడు గోవా, రాజస్థాన్ జట్ల మధ్య రంజీ మ్యాచ్
- 4 పరుగులతో అర్జున్ బ్యాటింగ్
జూనియర్ క్రికెట్లో తనదైన ముద్రవేయడంలో విఫలమైన అర్జున్ అడపాదడపా రాణించినా, బలమైన ముంబయి జట్టులో స్థానం సంపాదించడానికి ఆ గణాంకాలు సరిపోలేదు. ముంబయి రంజీ టీమ్ లో పోటీ ఎక్కువగా ఉండడంతో గోవాకు తరలివెళ్లాడు.
రంజీ ట్రోఫీలో భాగంగా ఇవాళ గోవా, రాజస్థాన్ మధ్య ఎలైట్ డివిజన్ గ్రూప్-సి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా, గోవా బ్యాటింగ్ కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి గోవా 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. అర్జున్ టెండూల్కర్ 12 బంతుల్లో 4 పరుగులతో క్రీజులో ఉన్నాడు.