రామచంద్రపై వైసీపీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?: నాదెండ్ల మనోహర్
- జనసేన నేత రామచంద్ర నివాసంపై నిన్న రాత్రి దాడి
- ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారని నాదెండ్ల మండిపాటు
- ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారే లేకుండా చేస్తున్నారని ఆగ్రహం
గత అసెంబ్లీ ఎన్నికల్లో పుంగనూరు నుంచి జనసేన తరపున రామచంద్రయాదవ్ పోటీ చేశారు. నియోజకవర్గంలోని రైతుల సమస్యలకు వ్యతిరేకంగా సదుంలో రైతుభేరి సభను తలపెట్టారు. దీనికి అనుమతి లేదని నిన్న పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా సభను తలపెట్టారంటూ నిన్న రాత్రి ఆయన ఇంటిపై దాడి జరిగింది. కర్రలు, రాళ్లతో తలుపులు పగులగొట్టి, ఇంట్లోకి వెళ్లి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న ఆరు కార్లను ధ్వంసం చేశారు. ఓ గదిలో ఉండి రామచంద్ర ప్రాణాలతో బయటపడ్డారు.