ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది: తెలంగాణ మంత్రి హరీశ్ రావు
- సిద్దిపేటలో జరిగిన ఉపాధ్యాయ సంఘం సమావేశానికి హాజరైన హరీశ్ రావు
- ఐదేళ్ల కాలంలో 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణేనని వెల్లడి
- ఏపీలో ఉపాధ్యాయులపై కేసులు పెట్టి లోపల వేస్తున్నారని వ్యాఖ్య
ఐదేళ్ల కాలంలో ఉద్యోగులకు 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణేనని హరీశ్ రావు అన్నారు. ఇంత మేర ఫిట్మెంట్ దేశంలో ఎక్కడైనా వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉందో గమనిస్తే... తెలంగాణలో తమ ప్రభుత్వం ఉద్యోగులతో ఎంత ఫ్రెండ్లీగా ఉందన్న విషయం అర్థమవుతుందని ఆయన అన్నారు.